కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Telangana Farmer ID Card పథకంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచే రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. ఈ కార్డు ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాల లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ఫార్మర్ ఐడీ కార్డు లక్షణాలు
ఈ Telangana Farmer ID Card 11 అంకెలతో ఉండి, రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్, భూమి వివరాలు, సాగు చేసిన పంటలు వంటి ముఖ్యమైన సమాచారం కలిగి ఉంటుంది. కిసాన్ నిధి, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు వంటి కేంద్ర పథకాలకు ఈ ఐడీ తప్పనిసరిగా ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా రైతులు తమ భూమి వివరాలను నమోదు చేయాలి. నమోదు తర్వాత ఓటీపీ ద్వారా Telangana Farmer ID Card జనరేట్ అవుతుంది. ఇది ఆధార్తో లింక్ అయి, విశ్వసనీయ డిజిటల్ గుర్తింపుగా వ్యవహరిస్తుంది.
రాష్ట్ర పథకాలపై ప్రభావం
రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకే ఈ ఫార్మర్ ఐడీ అవసరం లేదని అధికారికంగా స్పష్టం చేశారు. అయితే కేంద్ర పథకాల ప్రయోజనాల కోసం ఇది కీలకం.
Read More: New Ration Cards Telangana: అర్హులందరికీ రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!


